చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన మంత్రి

రూ.1.57 కోట్లతో 30 చెత్త సేకరణ వాహనాలుః మంత్రి పువ్వాడ

ఖమ్మంః ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను నివాసాల నుండి సేకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 వాహనాలను (మినీ వ్యాన్) రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే నగరంలో 20 చెత్త సేకరించే వాహనాలు అందుబాటులో ఉండగా నూతనంగా మరో 30 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డివిజన్ కు ఒక వాహనం కేటాయించి ప్రతిరోజు చెత్తను సేకరించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివిధ డివిజన్ లలో సేకరించిన చెత్తను స్వయం సహాయక సంఘాల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒక్కో వాహనం రూ.5.24 లక్షలు కాగా మొత్తం రూ.1.57 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ సుడా చైర్మన్ విజయ్ కుమార్ కమిషనర్ అనురాగ్ జయంతి డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.