ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. ఇద్దరు హత్య!

రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లా బాసగూడెం పోలీసు స్టేషన్‌ పరిధిలో తర్రెం వద్ద రహదారిపై వెళుతున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందు పాతరలు పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. వాహనం తునాతునకలైపోయింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. పోలీసు ఇన్ఫార్మర్‌ అన్న నెపంతో బీజాపూర్‌ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలిలో లేఖను వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.