తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 2166 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 1,74,774కి చేరింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య‌1052 కి చేరింది.  గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,143 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,74,774 మంది కరోనా బారినపడగా 1,44,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 29,649 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 22,620 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1052 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 53,690 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 25,73,005 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 82.43 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 

Leave A Reply

Your email address will not be published.