తెలంగాణలో కొత్త‌గా 384 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 631 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,78,108 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 2,69,232 మంది చికిత్స కోలుకున్నారు. మరో 7,380 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 5,298 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇవాళ్టి వరకు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1,496 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 101 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.