బస్సు లోయలో పడి 8 మంది దుర్మరణం

షిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో తీసా సబ్ డివిజన్ వద్ద బుధవారం ప్రైవేటు బస్సు లోయలో పడి 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చంబా-ఖజ్జియార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్నాక పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.