మోడల్స్కూల్ ఉపాధ్యాయులకు నోషనల్ సర్వీస్ నింబంధనలు అమలు చేయాలి..
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కోరిన పిఎంటిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య

పెద్దపెల్లి: మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లకు నోషనల్ సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని ఈరోజు PMTA తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ టీచర్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కలిసి NOTIONAL SERVICE మరియు ట్రాన్సఫర్ గురించీ విన్నవించడం జరిగింది.
2012లో ప్రత్యేక డియస్సీ ద్వారా నియమితులైన మోడల్ స్కూల్ టీచర్లు సీనియారిటీ జాబితాలో ముందు ఉన్నప్పటికీ జూనియర్ల కంటే తక్కువ వేతనాలు (దాదాపు 10 వేలు) పొందుతున్నారు, అలాగే అనేక సీనీయారిటి సంబంధింత బెనిఫిట్స్ ను కోల్పోతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే మోడల్ స్కూల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ నిబంధనలను అమలు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.
2008 మరియు 2012 సాదరణ డీఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకు కూడా ఇదే విధమైన సమస్య వస్తే APAT, SO NO 4800/2015. తేదీ 15/11 2015 మరియు AO NO 593/2016. dt :: 24/02/2016 ఉత్తర్వుల ద్వారా తెలంగాణ విద్యాశాఖ వారికి నోసషల్ సర్వీస్ కల్పించడం జరిగింది. కాబట్టి అదే నిబంధనలను మోడల్ స్కూల్ టీచర్లకు కూడా కల్పించాలని ప్రభుత్వానికి PMTA TS సంఘం తరఫున అనుముల పోచయ్య విజ్ఞప్తి చేశారు.
నోషనల్ సర్వీస్ నిబంధనలు అమలు చేస్తే సీనియార్టీ లిస్టు తయారు చేయడానికి వీలవుతుందని, తద్వారా పదోన్నతులు, బదిలీలు వంటివి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం అనుకున్న విధంగా త్వరితగతిన అమలు జరగడానికి అవకాశం ఉంటుందని అనుముల పోచయ్య అభిప్రాయపడ్డారు.
MLA మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఈ సమస్యను విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళుతానని, ఇదే విషయాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసికొని వెళ్తానని హామీ ఇచ్చారు.
కాగా 2012లో ప్రత్యేక డీఎస్సీ ద్వారా నియమితులైన మోడల్ స్కూల్ టీచర్లను దశలవారీగా విధుల్లోకి తీసుకోవడం వలన సర్వీస్ కాలము కోల్పోవడం జరిగిందని, ఈ సర్వీస్ కాలానికి నోసషల్ సర్వీస్ నిబంధనలను అమలు చేస్తూ సర్విస్ గ్యాప్ ను పూరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నోషనల్ సర్వీస్ ఇవ్వడం వలన సర్వీస్ కాలము పెరిగి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, ప్రధాన కార్యదర్శి అనుముల పొచయ్య, కన్వీనర్ సయ్యద్ సలీం, శ్రీనివాస్ రమేష్ తదితరులు కలిశారు.