మ‌రోసారి పెరిగిన‌ రాయితీ సిలిండ‌ర్ ధ‌ర‌

న్యూఢిల్లీ: ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. మ‌రోసారి రాయితీ సిలిండ‌ర్ ధ‌ర పెరిగింది. 15 రోజుల వ్య‌వ‌ధిలో రాయితీ సిలిండ‌ర్ ధ‌ర పెర‌గ‌డం ఇది రెండోసారి. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌ రాయితీ సిలిండ‌ర్‌పై రూ. 50 పెంచింది.
14.2 కేజీల సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెరుగ‌గా, 5 కేజీల చిన్న సిలిండ‌ర్ ధ‌ర రూ.18 పెరిగింది. 19 కేజీల సిలిండ‌ర్ ధ‌ర రూ. 36.50 పెరిగింది. రాయితీ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. ఢిల్లీలో సబ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 644కు చేర‌గా, కోల్‌క‌తాలో రూ. 670.50, ముంబైలో రూ.644, చెన్నైలో రూ.660కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.