వెటర్నరీ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసిన మంత్రి తలసాని..

బొంరాస్ పెట్:రైతుల నుండి డబ్బులు వసూలు చేసిన వెటర్నరీ అసిస్టెంట్ సస్పెండ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
వికారాబాద్ జిల్లా బొం రాస్ పేట మండలం తుంకి మెట్ల గ్రామ వేటనరీ అసిస్టెంట్ (V.A) శేఖర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బొం రాస్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల నివారణ మందుకోసం తమ వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు మంత్రికి పిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి శేఖర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.