శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ-49 నమూనా రాకెట్ని శ్రీవారి చెంత ఉంచారు. కాగా శనివారం మధ్యాహ్నం శ్రీహరి కోట షార్ నుంచి పీఎస్ఎల్వీసీ-49 రాకెట్ని ప్రయోగించనున్నారు. ఇందులో మన దేశానికి చెందిన ఈవోఎస్-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేవపెట్టనున్నారు. భూపరిశీలన ఉగగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. షార్ నుంచి ఈ ఏడాది చేస్తున్న తొలి ప్రయోగం ఇదే. కరోనా సవాళ్లను అధిగమించి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీసీ-49 ప్రయోగం చేయనున్నారు.