ఆగివున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి
అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బుల్లియ్య అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్ఛర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి రిపేరు చేస్తున్నాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి బైక్పై వస్తున్న కసూర్తయ్య అనే వ్యక్తి అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వాహనదారుడు కస్తూరయ్యతో పాటు ట్రాక్టర్కు మరమ్మతులు చేస్తున్న బుల్లియ్య సైతం తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.