ఆటోను ఢీ కొన్న కంటైనర్.. ముగ్గురు మృతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 5 గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసలు క్షతగాత్రులను వెంటనే దవఖానాకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.