ఇండియాలో కొత్త రకం కరోనా.. హైదరాబాద్లో ఇద్దరికి

న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ఆరుగురిలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఇందులో బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్లో మూడు శాంపిళ్లు, హైదరాబాద్ సీసీఎంబీలో 2 శాంపిళ్లు, పుణె ఎన్ఐవీలో ఒక శాంపిల్లో కొత్త రకం వైరస్ను గుర్తించినట్లు తెలిపింది. ఈ ఆరుగురిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచినట్లు తెలిపింది. వీళ్లతో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరినీ క్వారంటైన్కు తరలించినట్లు చెప్పింది. వీళ్లతోపాటు ప్రయాణించిన ఇతర ప్రయాణికులు, వారి కుటుంబాలు, ఇతరులను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది.