ఇరగవరం: ఇళ్ల పట్టాల పంపిణీలో తీవ్ర విషాదం

ఇరగవరం: ఎపిలోని ప.గో. జిల్లా ఇరగవరం మండలంలోని రేలంగి శివారు గవర్లపాడులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా ఆ టెంటుపై కొబ్బరి చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను భవాని(24), శాంతి(35)గా గుర్తించారు అధికారులు. క్షతగాత్రులను తణుకు ఆసుపత్రికి తరలించారు.