ఇవాళ రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టండి:

సీఎం జగన్ పిలుపు

అమరావతి: ఈ రోజు (శుక్రవారం) రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి అభినందనలు చెప్పాలని, అందులో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. తన నివాసం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.