ఈటల ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
రాజేందర్కు తప్పిన ప్రమాదం

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్రావుతో పాటు మరికొంతమంది నేతలు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్శంగా ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ జడ్సీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఈటల బృందం ఈ రోజు (మంగళవారం) ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్ అలెర్ట్ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించాడు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. సోమవారం ఢిల్లీలో ఈటల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఈటల బృందం సహా 184 మంది ప్రయాణికులతో ఉన్న విమానం టేకఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే ఫైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. దీంతో విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది.
కాగా ఇటీవల టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన ఈటలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు.