ఎపిలో కొత్త‌గా 174 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 47,803 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 174 పాజిటివ్‌ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ గురువారం బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే కొత్త‌గా కరోనా కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 7,179 మంది మృతిచెందారు. తాజాగా 78 మంది రికవరీ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం న‌మోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,91,178 కి చేరింది. అలాగే కోలుకున్నవారి సంఖ్య 8,82,841 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1158 యాక్టివ్‌ కేసులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.