ఎపిలో కొత్తగా 368 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 263 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,93,734 కు చేరింది. ఇందులో 8,84,347 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,188 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదని అధికారులు బులిటెన్లో వెల్లడించారు.