ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 232 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 40,177 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 352 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,83,082 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,72,897 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,070 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,115 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,177 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,19,72,780 శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది.