ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 46,386 మందికి కరోనా పరీక్షలు చేయగా 349 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,81,061కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 422 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,70,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,625. వైరస్ బాధితుల్లో కొత్తగా ఇద్దరు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 7094కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.