ఏపీలో కొత్తగా 402 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 56,425 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 402 కొత్త కేసులు నమోదయ్యాయి. నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,79,339 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా 8,68,279 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,978 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,13,57,530 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.