క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ కానుక పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

ములుగు: గోవిందా రావు పేట మండలం తహశీల్దార్ కార్యాలయం లో సోమవారం 20 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ కానుక లు ములుగు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధికి కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తో పాటు రెవెన్యూ అధికారులతో పాటు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, స్థానిక సర్పంచ్ జోగా నాయక్, పసర సర్పంచ్ ముద్ద బోయిన రాము, ముదుర కోళ్ల తిరుపతి, కుమార్ గౌడ్,వార్డు సభ్యులు చేరుకులా సురేష్,చింత క్రాంతి తదితరులు పాల్గొన్నారు