గొర్రెల పంపిణీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు

హైద‌రాబాద్: కరోనా మ‌హమ్మారి మూలంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.

1 Comment
  1. Mallesh Yengani says

    గొర్రెలను పంపిణి చేయడం కాదు ఉద్యోగాలు కల్పించండి….

Your email address will not be published.