గ్రేటర్‌లో వరద సాయానికి బ్రేక్..

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న వరద సాయాన్ని వెంటనే నిలిపేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యథావిథిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడినట్లైంది.
ఇప్పటికే గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం… ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అయ్యింది.. ఈ నేపథ్యంలో… మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది… జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు.. శివారులోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడ చూసినా.. గత రెండు రోజులుగా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి… ఇక, ఇవాళ మాత్రం భారీ ఎత్తున మీసేవ కేంద్రాలకు తరలివచ్చారు వరద బాధితులు.. గోల్కొండ పీఎస్‌ పరిధిలో మీసేవ కేంద్రం దగ్గర క్యూలైన్‌లో నిలబడి ఓ మహిళ మృతిచెందిన ఘటన కూడా వెలుగు చూసింది. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది ఎన్నికల సంఘం.

Leave A Reply

Your email address will not be published.