చొప్పదండి రైతుకు జాతీయ ఉత్తమ రైతు అవార్డు

చొప్పదండి: సమీకృత విధానంలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ యువ రైతును జాతీయ ఉత్తమ రైతు అవార్డు వరించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని పెద్దకుర్మపల్లికి చెందిన మల్లికార్జున్రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సాగుబాట పట్టాడు. సమీకృత విధానంలో దాదాపు 17 కరాల్లో పంటలు పండిస్తున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దేశవ్యాప్తంగా 2021 సంవత్సరానికి 35 మందిని ఉత్తమ రైతులను ఎంపిక చేసింది. వారిలో తెలంగాణ నుంచి మల్లికార్జున్రెడ్డికి చోటు దక్కింది. ఫిబ్రవరి 27న దేశ రాజధాని ఢిల్లీలో మల్లికార్జున్రెడ్డి ఈ అవార్డును అందుకోనున్నారు. తెలంగాణ రైతుకు ఈ అవార్డు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.