చ‌లికి గ‌డ్డ‌క‌ట్టిన స‌ర‌స్సు!

సిమ్లా: ‌దేశంలో చలి వ‌ణుకుపుట్టిస్తోంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌రిస్థితి మెరుగ్గానే ఉన్నా హిమాల‌య ప‌ర్వ‌తాల స‌మీపంలోని ఉత్త‌రాది రాష్ట్రాల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ డిగ్రీల‌కు ప‌డిపోయాయి. ప‌లుచోట్ల ఇండ్ల‌పైన, రోడ్ల‌పైన మంచు పేరుకుపోయింది. హిమాచల్ ప్ర‌దేశ‌లోనైతే ఏకంగా ఓ స‌ర‌స్సే గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు స‌బ్ జీరో స్థాయికి ప‌డిపోవ‌డంతో లాహౌల్-స్పితి జిల్లా జోబ్రాంగ్‌లోగ‌ల ఖొలుడు స‌ర‌స్సు పూర్తిగా మంచుగ‌డ్డ‌లా మారిపోయింది. దీంతో గ‌డ్డ‌క‌ట్టిన స‌ర‌స్సుపై న‌డుస్తూ ప‌ర్యాట‌కులు కొత్త అనుభూతిని పొందుతున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.