జైలు నుంచి అఖిలప్రియ విడుదల

హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. శుక్రవారం ఆమెకు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిల్పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని కోర్టు ఆమెకు సూచించింది. కాగా ప్రవీణ్ సోదరుల అపహరణ కేసులో భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.