తిరుమలలో ఘనంగా చక్రస్నాన మహోత్సవం

తిరుమల: శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కరోనా నిబంధనల కారణంగా వేడుకలకు భక్తులను అనుమతించలేదు. వేకువజామున చక్రతాళ్వార్ను ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణికి తీసుకెళ్లారు. అర్చకులు అక్కడ చక్రతాళ్వార్కి తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కర్పూర నీరాజనాలు అందించి, పుష్కరిణి చక్రతాళ్వార్కి స్నానమాచరింపు చేశారు. చక్రస్నానంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలతో పాటు అర్చకులు పాల్గొన్నారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఏకాంతంగా చక్రస్నానాన్ని నిర్వహించారు.