తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 53,686 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 609 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,71,492 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1465 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజు 873 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని బులెటిన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,61,028 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,999 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 6,922 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.