తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 573 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982కు చేరుకోగా, రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 1522 మంది మృతిచెందారు. భారత్లో కరోనా మరణాల శాతం 1.5 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 0.53 శాతంగా ఉంది. రికవరీ రేటు దేశంలో 95.7 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 97.12 శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,609 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు, ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 65,66,602కు చేరినట్టు కరోనా బులెటిన్లో పేర్కొంది సర్కార్.