తెలంగాణలో కొత్తగా 202 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఇద్దరు మృతి చెందగా, 253 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్బులిటెన్ విడుదల చేసింది. రాష్ర్టంలో మొత్తం 2,91,118 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4,442 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 2,85,102 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 1574కు చేరింది. ప్రస్తుతం 2,541 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 48 కేసులు నమోదు అయ్యాయి.