తెలంగాణలో కొత్తగా 224 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒకరు మృతి చెందారు. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ర్ట వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మొత్తంగా రాష్ర్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008కి చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,518. గత 24 గంటల్లో 461 మంది కోలుగా, ఇప్పటి వరకు 2,83,924 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1566కు చేరింది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 56, రంగారెడ్డి జిల్లాలో 26, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Telugu Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 11.01.2021)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline @HiHyderabad pic.twitter.com/hCekDUhyLN
— Dr G Srinivasa Rao (@drgsrao) January 11, 2021