తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, ,నిరుద్యోగ సంఘాల నేతలు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కారొపరేషన్కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమైన నేపథ్యంలో.. జిహెచ్ఎంసి చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బిజెపి, సిపిఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రిజర్వేషన్లు ఖరారు చేయకుండా జిహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించకూడదంటూ బిజెపి నేతలు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అసెంబ్లీ వద్ద గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఉదయం నుంచే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.