తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ లా, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్‌లో 62.35 శాతం, పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. మూడేళ్ల లాసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.స్నేహశ్రీ (98 మార్కులు) మొదటి ర్యాంకు సాధించారన్నారు. ఐదేళ్ల లాసెట్‌లో ఎస్ఎస్‌కే. పాంచజన్య, పీజీఎల్‌సెట్‌లో టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. మేలో జరగాల్సిన పరీక్షలు.. మహమ్మారి కారణంగా రెండుసార్లు వాయిదా వేసిన అనంతరం నిర్వహించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.