తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో మొదటి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో డ్రైవర్‌ రహిత రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. దీంతోపాటు నేషనల్‌ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రారంభించారు. అనంతరం పీఎం మోడీ మాట్లాడుతూ నగరీకరణ సవాల్‌గా కాకుండా అవసరంగా భావిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ.. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న దేశానికి రాజధానిగా ఉన్నది. ఈ ప్రతిష్ఠ ఇక్కడ ప్రతిబింబించాలని చెప్పారు. మనందరం కలిసి పనిచేస్తే ప్రజల జీవితాలు మెరుగుపడుతాయని, నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.