తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

హైదరాబాద్‌: నిమ్స్‌లో ఆధునీకరించిన అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌, ఎంఐఈఎల్‌ అధ్యక్షుడు పీపీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ఈహెచ్‌ఎస్‌, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200కోట్లు ఖర్చు చేస్తున్నాం. అదనంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నిధులు కేటాయిస్తున్నాం. రూ.7,500 కోట్లు వైద్యరంగంపై ఖర్చు చేస్తున్నాం. రూ.450కోట్లతో నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. వైద్యరంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని’ పేర్కొన్నారు.

అలాగే ‘తొలి వ్యాక్సిన్‌ నేనే వేయించుకుంటాను. కొత్త స్ట్రెయిన్‌కు భయపడాల్సిన పనిలేదని. రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం అయింది. కేంద్రం ఎప్పుడు వ్యాక్సిన్‌ పంపినా వాక్సినేషన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రోజుకు 10లక్షలు మందికి వాక్సిన్‌ ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. వాక్సినేషన్‌ కార్యక్రమం రెండు ఆస్పత్రుల్లో ఉంటుంది.` అని మంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.