దుబ్బాక: రెండో రౌండ్లో బిజెపి ఆధిక్యం

దుబ్బకా: దుబ్బకా ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్ధిపేటలోని ఇందూరు కళాశాలలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫిలితాల్లో మొదటి, రెండో రౌండ్లోనూ కలిపి బిజెపి అభ్యర్థి రఘునందనరవు 1,135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్లో బిజెపికి 3,208 టిఆర్ెస్కు 2,867. కాంగ్రెస్కు 648 ఓట్లు పోలయ్యాయి.
దుబ్బాక ఉపఎన్నిక రెండో రౌండ్లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 620 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 4,769, టీఆర్ఎస్కు 4,419 ఓట్లు, కాంగ్రెస్కు 922 ఓట్లు లభించాయి.
దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.