నారా లోకేష్కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. టిడిపి నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్పై వెళుతుండగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే రామరాజు ట్రాక్టర్ను అదుపుచేశారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్ను అదుపు చేసి లోకేష్ను కిందకు దించారు. దీంతో ప్రమాదం తప్పింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.