నా హృదయాన్ని దోచుకున్నాడు: కెటిఆర్

హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో భాగంగా బల్కంపేట్లోని వైకుంఠదామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సనత్నగర్లోని థీమ్ పార్క్ నిర్మాణానికి మంత్రి తలసానితో కలిసి భూమి పూజ చేశారు. మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని, మారేడ్పల్లిలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా సనత్ నగర్లో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తన్న సమయంలో ఓ చిన్నారి స్మార్ట్ ఫోన్ పట్టుకొని కేటీఆన్ను ఫోటో తీశారు. ఈ ఫోటోను నిన్నటీఆర్ఎస్ ఎమ్మెల్య బాల్కసుమన్ తన ట్విటర్ పోస్టు చేశారు. పిక్ ఆఫ్ ద డే అనే క్యాప్షన్తో షేర్ చేశారు. కాగా ఈ ఫోటో నేడు కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆ ఫొటోను కేటీఆర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు. నిన్న సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించాను. పలు వేదికలపై మాట్లాడాను. ఆ బాలుడు ఈ ఫొటోను ఎక్కడ తీశాడో కచ్చితంగా తెలియదు. కానీ, ఈ చిన్నారి బాగా ఫోకస్ పెట్టి తన పని కానిచ్చాడు’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
This kid stole my heart 💜
Toured Sanath Nagar constituency yesterday & spoke at multiple venues. Not sure where this was from but this young one seems so focused 😀 pic.twitter.com/b3MkwcLLaz
— KTR (@KTRTRS) November 14, 2020