పెద్దిరెడ్డి, బొత్సకు కొత్త బాధ్య‌త‌లు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేర‌కు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త‌గా గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖల‌ను కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166 అధికరణలో గల క్లాజ్‌(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ఆరులోని సబ్‌ రూల్‌(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.