భారత్లో కొత్తగా 45,903 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,281 కరోనా కేసులు నమోదు కాగా.. 512 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. 1,27,571 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,94,657 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స నుంచి కోలుకుని 80,13,784 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.79 శాతం కాగా.. మరణాల రేటు 1.48 శాతంగా ఉందని బుధవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.