భార్యాబిడ్డను పొలంలోనే వదిలేసిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

కమలాపూర్‌: ద‌ంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో ఓ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, కొడుకును పొలంలో వదిలేసి వెళ్లాడు. వీరితో పాటు పెండ్లి సమయంలో పెట్టిన మంచాలు, వస్తువులను సైతం అక్కడే పడేశాడు. ఈ ఘటన వరంగల్‌ అర్బ న్‌ జిల్లా కమలాపూర్‌లో ఆదివా రం చోటుచేసుకొన్నది. కమలాపూర్‌కు చెందిన పిల్లి దీపకు అదే గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోగు ఓంకార్‌తో ఆరేండ్ల క్రితం పెండ్లి జరిగింది. వీరికి మూడేండ్ల కొడుకు ఉన్నాడు

గ‌త కొంతకాలంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు చోటుచేసుకోవడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ జరిగింది. అనంతరం భార్యను కాపురానికి తీసుకెళ్లిన ఓంకార్‌ ఇటీవల మళ్లీ చిత్రహింసలు పె ట్టాడు. దీంతో మరోసారి పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకొన్నారు.

ఓం కార్‌ ఆదివారం శివారులోని ఓ వ్యవసాయ భూమిలో భార్య దీప, కొడుకును వదిలేసి వెళ్లిపోవ‌డంతో.. తనకు న్యా యం చేయాలంటూ దీప అక్కడే బైఠాయించింది. విషయం తెలుసుకున్న భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.