మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్కు కొవిడ్ పాజిటివ్

చెన్నై: మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమ్మేశ్వర్ ప్రతాప్ సాహి కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించారు. ప్రధాన న్యాయమూర్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో గురువారం చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పరీక్షలు చేయగ పాజిటివ్గా వచ్చిందని ఆసుపత్రి సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. జస్టిస్ అమ్రేశ్వర్ దగ్గు, అలసటతో బాధపడుతుండగా.. ఆయనకు సిటీ స్కాన్ పరీక్షలు చేశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఆయనను కొవిడ్ వార్డుకు తరలించి, వైద్యసేవలందిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి గురువారం కోర్టులో పలు కేసుల విచారణకు హాజరయ్యారు. సాయంత్రం లక్షణాలతో హాస్పిటల్కు వెళ్లగా నిర్వహించిన పరీక్షలో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.