మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు

ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 11,141 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో తాజాగా మరో 38 మరణాలు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,19,727కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 52,478కు చేరింది. అలాగే తాజాగా 6,013 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,68,044కు చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 97,983 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.