మహారాష్ట్రలో కొత్త‌గా 8,807 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో కరోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 8,807 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80 మర­ణాలు నమో­ద­య్యాయి. మహా­రా­ష్ట్రలో కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,21,119కు, మర­ణాల సంఖ్య 51,937కు చేరింది. మరో­వైపు గత 24 గంటల్లో 2,772 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.