మహారాష్ట్రలో 4,259 కరోనా కేసులు.. 80 మరణాలు

ముంబ‌యి: మహారాష్ట్రలో కరోనా వైర‌స్‌ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద వరకు మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 4,259 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,76,699కు, మరణాల సంఖ్య 48,139కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 3,949 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,53,922కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీరేటు 93.46 శాతంగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,542 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.