కరోనా ఎఫెక్ట్: `మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి`!
ముషీరాబాద్, గోదావరిఖనిలో గేట్ల ముందు ఫ్లెక్సీలు

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జనం అప్రమత్తమయ్యారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా టెస్టులకోసం పరుగులు తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ` దయచేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. హైదరాబాద్లోని ముషిరాబాద్ పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొటీలో ఓ కాలనీ వాసులు. అలాగే పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ఇంటి ముందు `మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ సెల్ఫ్ పోస్టర్లు ఇంటికి ఏర్పాటు చేకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
కరోనా కట్టికోసం ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం పలు కాలనీ వాసులు స్వచ్చంధంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పలు బస్తీ వాసులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ముషిరాబాద్ పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొటీలో కాలనీ వాసూలు `దయచేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ వినూత్నంగా ఓ ప్లెక్సీని ఇంటికి ఏర్పాటు చేసుకున్నారు.

అలాగే పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్లోని ఓ కాలనీలో పలు ఇండ్లకు `దయచేసి మా ఇంటికి రాకండి- మీ ఇంటికి రానివ్వకండి` అంటూ వినూత్నంగా పోస్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. గాలిలోనూ కరోనా వ్యాప్తి వేగంగా ఉందని వైద్యశాఖ చెప్పడంతో కాలనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలనీవాసులు స్పష్టం చేశారు.
రెండో దశ కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ముషీరాబాద్లోని ఓ పద్మశాలీ కాలనీ వాసులు.. పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ కాలనీలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయ నిర్భంధంతోనే కరోనాను కట్టడి చేయవచ్చని. ఈ కొత్త కార్యక్రమంతో తమ తోటి వారికి తెలియజేస్తున్నారు. ఇండ్ల ముందు గేటుకు ప్లెక్సీ ఏర్పాటు చేసిన ప్లెక్సీ చూసిన అందరూ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు చూసి శభాష్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.