మూసాపేట మెట్రో స్టేషన్ గోడలకు పగుళ్లు

హైదరాబాద్ : మెట్రో స్టేషన్లో గోడల పగుళ్లు ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ పగుళ్ల మూలంగా ఊడిన పడిన పెచ్చులతో మనుషులు ప్రాణాలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు నగరవాసులు గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా మూసాపేటలోని మెట్రో స్టేషన్ గోడలతో పాటు స్టేషన్పైకి వెళ్లే మెట్లపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు రేపుతున్నాయి. పగుళ్లకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. ఈ నెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్ల సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే నిర్వహణ లేమి కారణంగా ఈ పగుళ్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. కాగా గతంలో అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ జరిగిన ఈ ఘటనతో కొంతకాలం వరకు మెట్రో స్టేషన్ల కింద నిలబడడానికి ప్రజలు భయపడ్డారు. మళ్లీ ఇప్పడు మూసాపేట మెట్రో స్టేషన్లో గోడల పగుళ్లగురించి నగరవాసులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.