మహారాష్ట్రలో కొత్తగా 3,145 కరోనా కేసులు.. 45 మరణాలు

ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,145 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కొవిడ్తో తాజాగా 45 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,84,768కు, మరణాల సంఖ్య 50,336కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 3,500 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,81,088కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,152 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.