మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదిన్నాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలను, శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠున్ని ప్రార్థించారు.