యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. ఎల్బీనగర్‌కు చెందిన జగదీశ్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన జగదీశ్‌ (33) అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై అప్పుల పాలయ్యాడు. ఇప్పటికే కొన్ని అప్పులు తీర్చినా.. మరిన్ని అప్పులు ఉండడంతో వాటిని తీర్చే మార్గం లేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను క్షమించాలని భార్యకు సెల్ఫీ వీడియోను పంపాడు. జగదీశ్ గతంలో రూ.12లక్షల వరకు అప్పులు తీర్చాడు. మిగతా అప్పును తీర్చేందుకు మరోసారి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి నష్టపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.